మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో
నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మణుగూరు ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ముందుగా ఫోటోగ్రఫీ పితా మహుడు లూయిస్.డాగురే చిత్ర పటానికి పూలమాల వేసి, ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి జరగాలంటే ప్రతి సభ్యుడు విధిగా అసోసియేషన్ నియమ నిబంధనలు పాటించాలని,కరోన నిబంధనలు పాటిస్తూ, శుభకార్యాలకు వెళ్లాలని, ద్విచక్రవాహనంపై వెళ్లే వారు తప్పక హెల్మెట్ ధరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గాజుల పూర్ణ చందర్ రావ్,జిల్లా ఉపాధ్యక్షులు మామిడి జేమ్స్,అసోసియేషన్ అధ్యక్షులు వన్నం.కృష్ణ మోహన్,కార్యదర్శి పూసులూరి.శ్రీనివాస్,కోశాధికారి మహ్మద్ రఫీ మరియు కమిటీ సభ్యులు, అసోసియేషన్ శాస్వత సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: