భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18 (మన్యం మీడియా) బుధవారం నాడు కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం యూపిహెచ్ ఎస్ సెంటర్ డాక్టర్ సంజీవ్ రావు నీ వారి సిబ్బందికి మరియు రామవరం జవాన్లకు,6వ వార్డ్ శానిటేషన్ వర్కర్ రఫీ, ఆర్ పిలు, అంగన్వాడి, ఆశ వర్కర్స్ కు తన ఇంటి వద్ద సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు ఎనలేని సేవలు చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న వైద్య మరియు మునిసిపల్ సిబ్బందికి వారి యొక్క సేవలను మరియు ఏ ఇంటికి కరోనా వచ్చిన వారి సిబ్బందితో వెళ్లి సేవలను నేరుగా అందిస్తున్నందుకు అలానే శానిటేషన్ జవాన్లు పారిశుద్ధ్యాన్ని వార్డ్ లో ప్రజల ఇంటి పరిసరాలలో బ్లీచింగ్ స్ప్రే చేస్తూ, ఆశా వర్కర్లు ఆర్ పి లు, మరియు అంగన్వాడి ఇల్లు ఇల్లు తిరిగి సీజనల్ వ్యాధులపై సర్వే చేయడం గమనార్హం. వారు కరోనా కాలంలో ఎంతో కష్టపడ్డారని వారికి వారి సేవలకు సన్మానించడం హర్షణీయం అని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, టీబీజీకేఎస్ 11 మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, సత్యనారాయణ,పెంటయ్య, సూరిబాబు నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: