మన్యం టీవీ పాల్వంచ:-
వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీలో ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది. సర్పంచ్ వాసం. రుద్ర,వాసం. మంగయ్య , ఉప సర్పంచ్ బర్ల.లక్ష్మణరావు సమక్షంలో 100మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు.కంటిచూపు మందగించడంలో 40 మంది పైగా ఉన్నారని ఈ పరీక్షల్లో తేలింది. వీరికి ఉచితంగా కంటికి సంబంధించిన ఆపరేషన్ లు భీమవరంలోని శ్రీకృష్ణ ఆస్పటల్ లో నిర్వహిస్తామని డాక్టర్ చెప్పినారు.ఈ ఉచిత కంటి శిబిరాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలి అని సర్పంచ్ వాసం.రుద్ర చెప్పింనారు.
Post A Comment: