మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని హనుమాన్ టెంపుల్ వద్ద మావోయిస్ట్ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మణుగూరు ఎస్ఐ పురుషోత్తం ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు.మావోయిస్ట్ వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంచ నీయ సంఘటనలు జరగకుండా పోలీసులు వాహనాలు క్షుణ్నంగా తనిఖీ చేసి ధృవ పత్రాలు పరిశీలించి, వాహనాలు సోదాలు చేశారు.వాహనదారులు వాహన ధ్రువ పత్రాలు, లైసెన్సు కలిగి ఉండాలన్నారు.అనుమానాస్పదంగా కనిపించిన వారి ఆధార్ కార్డ్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ పురుషోత్తం,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: