జి సి సి మేనేజర్ కె వాణి వెల్లడి
గుండాల ఆగస్టు 1 (మన్యం మనుగడ) అటవీ ఉత్పత్తులు కొనుగోలు ప్రారంభమైందని జి సి సి మేనేజర్ కే వాణి తెలిపారు. కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ. శాస్త్రీయ పద్ధతిలో సేకరించేందుకు శిక్షణ ఇచ్చి అనంతరం వారి ద్వారా సేకరణ చేస్తామని ఆమె అన్నారు. ఉత్పత్తులైన చిల్లగింజలు, ముష్టి గింజలు, చింతపండు, చీపుర్లు, ఇతర అటవీ ఉత్పత్తులను జి సి సి ద్వారా సేకరిస్తామన్నారు. గిరిజన గ్రామాల్లో వందనం వికాస్ కేంద్ర అటవీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు జి సి సి అకౌంటెంట్ లక్ష్మణ్ , క్యాషియర్ రాజన్న, సేల్స్ మెన్లు శ్రీనివాస్,పగఢ య్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: