. జిల్లా అధ్యక్షునిగా లంక నరసింహారావు
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : టిఆర్ఎస్ కార్మిక విభాగం అనుబంధ సహకార సంఘాల ( పిఎసిఎస్ / ఎల్ యస్ సి యస్ ) జిల్లా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం గా జరిగింది. శుక్రవారం జరిగిన జిల్లాలోని 16 సహకార సంఘాల ఉద్యోగుల, 60 మంది సిబ్బంది సమావేశంలో జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షునిగా లంక నరసింహారావు, ఉపాధ్యక్షునిగా పొన్నాజీ ప్రేమ చారి, ప్రధాన కార్యదర్శిగా సున్నం వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఎస్ రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, సైదులు,హరిప్రసాద్, రాంబాబు గౌడ్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస రావు, నాగేశ్వరరావు గౌడ్, సాయి సారయ్య లు ఎన్నికైనారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీ బాధ్యులు మాట్లాడుతూ... సహకార సంఘాల బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల,ఉద్యోగుల సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: