👉 కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన విప్ రేగా కాంతారావు
*యాజమాన్యం తో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం:విప్ రేగా హామీ
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఓపెన్ క్యాస్ట్ మైన్ 2 లో జరిగిన సంఘటన లో 3 ముగ్గురు చనిపోవడం దురదృష్టకరం అని విప్ రేగా కాంతారావు అన్నారు.వారికి సంతాపాన్ని ప్రకటిస్తూ,వారికుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.వారి కుటుంబాలను ఆదుకొనుటకు కంపెనీ నుండి ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్,వారికుటుంబ సభ్యలకు డిఫెండెంట్ ఉద్యోగంతోపాటు అదనంగా ఒకొక్కరికి 50 లక్షలు ఇవ్వాలని,అదేవిదంగా ఇంకో వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోవడంతో వారి కుటుంబానికి కూడా కంపెనీ 50 లక్షల తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ స్థానిక తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరియు పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తు, తీర్మానించడమైనది అని తెలియజేశారు.ఈ సమష్యను సీఎం కేసీఆర్, దృష్టికి తీసుకొనివెళ్లి తప్పకుండా ఆయా కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే విదంగా ప్రయత్నం చేస్తానని విప్ రేగా కాంతారావు తెలిపారు.
Post A Comment: