మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా ఓసి టు లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది.బొలెరో వాహనం పైకి డంపర్ ఎక్కడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.మృతి చెందిన వారి లో సాగర్ జనరల్ మజ్దూర్,పాషా ఎలక్ట్రిషన్, వెంకన్న బొలెరో డ్రైవర్ ఉన్నారు.వీరిలో ఇద్దరు సింగరేణి కార్మికులు కాగా ఒకరు ప్రైవేటు కార్మికులుగా ఉన్నట్లు సమాచారం. వివరాల ప్రకారం సింగరేణి ఓసి టు లో పనిచేస్తున్న ఎలక్ట్రిషన్ పాషా,జనరల్ మజ్దూర్ సాగర్,వెంకన్న బొలెరో డ్రైవర్ మధ్యాహ్నం మైన్ లోకి వెళ్తుండగా డంపర్ ఢీకొట్టడంతో వీరు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక సింగరేణి హాస్పిటల్ తరలించారు.ఏరియా హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో విషాదఛాయలు అలుముకున్నాయి.విషయం తెలుసుకున్న కార్మికులు కార్మిక సంఘాల నాయకులు మృతదేహాలను సందర్శించారు.హాస్పిటల్ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక సిఐ భాను ప్రకాష్,ఎస్సై.నరేష్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహిస్తూ,విచారణ చేపట్టారు.
Post A Comment: