శిశువు మృతి చెంది రెండు రోజులైనా కాన్పుకకా తల్లి అవస్థలు
కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గిరిజన మహిళల అవస్థలు
గుండాల ఆగస్టు 30 (మన్యం మనుగడ) గిరిజన మహిళ కాన్పు కష్టాలతో తల్లడిల్లుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ల పల్లి మండలం పాతూరు గ్రామానికి చెందిన గుగ్గేల మైన కాన్పుకు ముందే బిడ్డ చనిపోవడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రసవ వేదన చెందుతుంది. సాధారణ కాన్పు కావడం కోసం రెండు రోజులుగా వైద్యం అందిస్తున్న కాన్పు కాకపోవడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పాపా చనిపోయిందని ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులకు తల్లి కేమన్నా అవుతుందా అన్న ఆవేదన వారిలో మొదలైంది.
దీనిపై ఆళ్ల పల్లి వైద్యురాలు సంధ్యారాణి వివరణ కోరగా; సాధారణ కాన్పు కోసం వేచి చూస్తూ ఉండవచ్చని ఆపరేషన్ చేస్తే భవిష్యత్తులో మరో రెండు కాన్పులు కావాలనుకుంటే ఇబ్బందులు కు ఆమె గురయ్యే ప్రమాదం ఉన్నందున సాధారణ ప్రసవం కోసం వేచి చూసి ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు
Post A Comment: