మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, చిన్న గొల్లగూడెం గ్రామంలో సంగం నాగరాజు ఇటీవలే డెంగ్యూ తో బాధపడుతు నరాల బలహీనత, పక్షవాతం రావడం వల్ల సత్తుపల్లి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుని తన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషియం తెలుసుకున్న భీముని గూడెం (మద్ది కొండ) గ్రామానికి చెందిన, గంగారం బెటాలియన్ పోలీసు కానిస్టేబుల్ తాటి నాగార్జున, నాగరాజు ఆరోగ్య పరిస్తితి గురించి తెలిసి, చలించి పోయి తన వంతు 20 వేల రూపాయిలు ఆర్థిక సహాయం గ్రామస్తుల సమక్షంలో, వారి కుటుంబ సభ్యులకు అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్కారం ఎంపీటీసీ నాయుడు శ్రీను, మద్ది కొండ సర్పంచ్ తాటి భవాని, గ్రామ అధ్యక్షులు తాటి రామకృష్ణ, నల్లపు నాగేంద్ర రావు, వెంకటేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: