CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి - జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో బూర్గంపాడు మండల పరిధిలోని టేకులచేరువు గ్రామ పంచాయతీలో ప్రాథమికోన్నత పాఠశాలను మరియు ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్చించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.

అనంతరం విద్యాసంస్థలు తెరిసిన తర్వాత పాఠశాలలోని విద్యార్థులకు జ్వర సూచన ఉంటే అయా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే అతి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని జడ్పీటీసీ సూచించారు.ఒకవేళ కోవిడ్ నిర్దారణ అయితే సదరు విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు శానిటేషన్ చేసుకోవడం,మాస్కులు విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను విధిగా పాటించాలన్నారు,పారిశుద్ధ్యం బాధ్యత అయా గ్రామ పంచాయతీ సర్పంచులదే అని సూచించారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ఎంపీడీఓ వివేక్ రామ్,స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచు భూక్య సుజాత,ఆశ వర్కర్స్, ఏఎన్ఎంలు,ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: