మైనార్టీ జిల్లా నాయకులు ఎండి ఆదాం
గుండాల ఆళ్ల పల్లి ఆగస్టు 12 (మన్యం మనుగడ) పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మైనార్టీ జిల్లా నాయకులు ఎండి ఆదాం కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. గడిచిన రెండు రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన దొంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రాన పవిత్రుడు కాడని అన్నారు. ఇలాంటి వారివల్లనే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా నికార్సయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దొంగల మాటలను నమ్మవద్దని హితవు పలికారు
Post A Comment: