మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని పూల కమ్మ గుత్తి కోయ గుంపులో గురువారం ఏటూరు నాగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు.ఇంటింటి సోదాలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మీ గూడెం లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరించినట్లు అయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.డ్రోన్ కెమెరా ల తో మీ గుండెల చుట్టుప్రక్కల ప్రాంతాల పైన నిఘా కొనసాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: