రహదారి రూపురేఖలు మార్చిన ఏడూళ్ల బయ్యారం పోలీస్ శాఖ
ఫ్రెండ్లీ పోలీసింగ్ మా పోలీస్ శాఖ లక్ష్యం: ఏడూళ్ళ బయ్యారంఎస్సై టీవిఆర్ సూరి
మన్యం మనుగడ, పినపాక:
ఆ ఊరికి సరైన రోడ్డు సదుపాయం లేదు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అంతే సంగతులు. చిన్నపాటి వర్షం కురిస్తే దారి బంద్, గ్రామస్తులకు నరకయాతనే. ఆ గ్రామమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని అమరారం పంచాయతీ లో గల జిన్నెల గూడెం. జిన్నెల గూడెం అమరారం పంచాయతీలో ఒక చిన్న ఆదివాసి గ్రామం. జిన్నెల గూడెం గ్రామం అమరారం గ్రామానికి కొద్దిపాటి దూరంలోనే ఉన్నప్పటికీ సరైన రహదారి సౌకర్యం లేక, ఆదివాసీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిశీలన నిమిత్తం ఆ గ్రామానికి వెళ్లిన ఏడూళ్ల బయ్యారం ఎస్సై టి వి ఆర్ సూరి జిన్నెల గూడ గ్రామ ప్రజలు పడే అవస్థలు గమనించారు. వెంటనే స్పందించిన ఆయన ఏడూళ్ల బయ్యారం పోలీసు శాఖ వారి సహకారంతో జిన్నెల గూడెం గ్రామానికి 2.5 కిలోమీటర్ల పొడవైన గ్రావెల్ రోడ్డును తన సొంత ఖర్చులతో వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై టి వి ఆర్ సూరి మాట్లాడుతూ, జిన్నెల గూడెం గ్రామ ప్రజల అవస్థలను గమనించిన నేను రహదారి సౌకర్యం కల్పించాలని నిర్ధారించుకుని, సుమారు రెండు వందల ట్రాక్టర్ల గ్రావెల్ ను, రోడ్డు నిర్మాణానికి ఉపయోగించామని, జిన్నెల గూడెం గ్రామ ప్రజల కళ్ళలో ఆనందం చూసి సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమానికి సహకరించిన ఏఎస్పీ శబరీష్ కు, సీఐ దోమల రమేష్ కు, పోలీసు శాఖ సిబ్బందికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజానీకానికి దగ్గరగా ఉండి వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కార దిశగా అడుగులు వేయడం పోలీసు శాఖ లక్ష్యమని తెలియజేశాడు. ఇప్పటివరకు పడిన బాధలు నేటితో లేకుండా పోయాయని జిన్నెల గూడెం గ్రామ ప్రజలు పోలీసు శాఖను అభినందిస్తున్నారు.
Post A Comment: