CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉధృతమవుతున్న పోడు రైతుల ఆందోళన....

Share it:

  


                                     పురుగు మందు తాగిన ఇద్దరు పోడు దారులు.....

 

 అటవీశాఖ పోడు దారులు మధ్య ఘర్షణ వాతావరణం..

 

 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: చండ్రుగొండ మండలం లోని రామవరం రేంజ్ పరిధిలోని దామరచర్ల బీట్ సీతాయిగూడెం గ్రామం పోడు రైతులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం..............

 వివరాల్లోకి వెళితే

 గ్రామంలో ఉన్న పోడు రైతులు సుమారు 20 సంవత్సరాలుగా పోడు రైతులు, పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి పోడు రైతుల అటవీశాఖ ల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కూడా అటవీ శాఖ పోడు రైతుల మధ్య ఘర్షణ జరిగింది. మళ్లీ ఈరోజు శనివారం తెల్లవారుజాము నుంచి అటవీ శాఖ ఆధ్వర్యంలో జెసిబి, ట్రాక్టర్లతో, పోడు సాగు చేసుకుంటున్న రైతుల పంటను (ప్లాంటేషన్ లో ) భాగంగాచదును చేస్తుండగా పోడు రైతులు అడ్డుకుని ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న పోడు రైతులను అటవీ శాఖ మరియు పోలీస్ శాఖ వారు కొంతమంది రైతులను చండ్రుగొండ పోలీస్ స్టేషన్ కు మరియు రామవరం రేంజి ఆఫీస్ కి తరలించడం జరిగింది. ఈ ఉద్రిక్త వాతావరణంలో కళ్ళముందే తాము సాగు చేసిన భూమిని ట్రాక్టర్ తో దున్నుతున్న గా ఇద్దరూ పోడు రైతులు పురుగుమందు తాగి ఆత్మయత్ననానీకి ప్రయత్నించారు. వారిద్దరినీ మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పోడు రైతుల ఆందోళనలు లో సుమారు 30 పోడు రైతు కుటుంబాలు పాల్గొనడం జరిగింది. వారిలో కొందరు నీ కుంజా ఈశ్వరమ్మ, గుర్రం ప్రతాప్, గుర్రం రాజ్ కుమార్, గుర్రం పుల్లమ్మ, పదం ముత్యాలు, కేసర వసంత, కొండూరు వెంకటమ్మ, గుర్రం వెంకన్న, పద్ధం స్వామి, గుర్రం రవి, బన్నీ రాము, తదితర పోడు రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. మమ్మల్ని ఫారెస్టు అధికారులు కొట్టి జీపులో పోలీస్ స్టేషన్కు తరలించడం అన్యాయమని బాధపడుతున్నారు. వెంటనే పోడుదారులు నీ విడుదల చేయాలని సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని పోడు రైతులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో చంద్రుగొండ రేంజర్ శ్రీనివాసరావు, రామవరం రేంజర్ సురేష్, చండ్రుగొండ ఎస్ ఐ బి రాజేష్ కుమార్ సుమారు 30 మంది ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పనులు దగ్గర బందోబస్తునిర్వహించారు.

Share it:

Post A Comment: