మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట లో అమ్మ సేవ వృద్ధాశ్రయంలో అశ్వారావుపేట సిఐ బంధం ఉపేంద్ర, ఎస్ఐ అరుణ ఆధ్వర్యంలో 30 మంది వృద్ధులకు అనాధాలకు నిత్యావసర సరుకులు అందించారు.. 75వ స్వతంత్రియ దినోత్సవ సందర్భంగా సీఐ బంధం ఉపేంద్ర కుమార్ మాట్లాడుతు ఇప్పటికి కొంత మంది ఇలా వృద్ధాశ్రయంలో అనాధాలగా ఉండడం చాలా బాధాకరమని జన్మనిచ్చిన తల్లితండ్రులును ఇలా వృద్ధాశ్రయంలో వదిలేయడం చాలా బాధాకరమని తన వంతుగా తాను ఈ రోజు వృద్ధాశ్రయంలో 30మంది వృద్దులకు 20 వేలు రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నానని తెలిపారు. మనకు తల్లిదండ్రులు జన్మనివ్వబట్టే మనం ఈ రోజున ఇంత ప్రయోజకులం అయ్యామని, వాల్లే జన్మనివ్వకపోతే మనం అసలు మనం ఈ భూమి పైకి వచ్చేవాళ్ళమా అంటూ మాట్లాడుతూ ఇలా వృద్ధాశ్రయంలో తల్లిదండ్రులు మగ్గుతున్నంతకాలం మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ సంతోషపడే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికీ ఎప్పటికి వృద్ధాశ్రయంలో ఏదైనా సహాయం కావాలంటే మా వంతు సహాయాన్ని అందిస్తామని బంధం ఉపేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
Post A Comment: