భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్
మన్యం మనుగడ, అశ్వాపురం:
అశ్వాపురం మండలం గొంది గూడెం లో వలస గొత్తి కోయ మహిళలకు జిల్లా ఎస్ పీ ఆదేశాల మేరకు అశ్వాపురం పోలీస్ శాఖ సీ ఐ సట్ల రాజు ఆధ్వర్యంలో జీవన్ ఆధార్ సొసైటీ వారి సహకారంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ను జిల్లా ఎస్ పీ సునీల్ దత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ పీ మాట్లాడుతూ గొత్తి కోయ మహిళలు ఆర్థికంగా ఎదిగేలా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన సీ ఐ రాజు ను ఎస్ పీ అభినందించారు. వలస గొత్తి కోయ గ్రామాల గిరిజనులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఏ ఎస్ పీ శబరిష్, సీ ఐ సట్ల రాజు, సర్పంచ్ లు పాయం భద్రమ్మ, సూరి బాబు, జీవన్ ఆధార్ సొసైటీ అధ్యక్షురాలు వాసంతి, పోలీస్ సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు.
Post A Comment: