CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

యాంపాటికి వనమాలి బిరుదు

Share it:




మన్యం మనుగడ, పినపాక:


రాజ్యసభ సభ్యుడు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల  టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు యాంపాటి సందీప్ రెడ్డి కి ప్రతిష్టాత్మక వనమాలి బిరుదు ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్,పినపాక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ,నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సందీప్ రెడ్డి కోరారు.

ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గర్వంగా ఉంది  ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలి అని నా విజ్ఞప్తి అని సందీప్ రెడ్డి తెలియజేశాడు.

Share it:

TELANGANA

Post A Comment: