భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 29 (మన్యం టీవీ) :- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావుని ప్రోటోకాల్ లో అవమానపరిచిన అధికార పార్టీ నిర్వాహకులు జిల్లా అధికార యంత్రాంగం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదివాసి ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ దొర స్పష్టం చేశారు ఆదివారం నాడు కొత్తగూడెం క్లబ్ నందు జరిగిన ఐకాస సమావేశంలో పేర్కొంటూ ఆదివాసీలను వివక్షత,చిన్న చూపు చూస్తే జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని,అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలలో అధికార పార్టీలోని అగ్రవర్ణాలు పద్ధతి మార్చుకోవాలని రేగా కు జరిగిన అవమానంపై నిర్వాహకులు జిల్లా అధికార యంత్రాంగం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పలని పక్షంలో వారిపై దశలవారీ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కంగళ జగన్,
పద్దం భుజంగరావు,పాయం లక్ష్మీ నర్సు, కాలేటి ప్రవీణ్, ఎల్ల బోయిన వీరన్న, పడిగా రాఘవులు,వాసం అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: