మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన పంతం నాగరాజు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో పనిచేస్తూ, ప్రమాదవశాత్తు కింద పడి కాలి ఎముకలు విరిగి పోవడంతో, శస్త్ర చికిత్స అనంతరం ఇంటికే పరిమితమై సరిగా నడవలేని స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న శ్రీ వివేకానంద కంప్యూటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీరామ్ బృహస్పతి 25 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల సంపత్,నివేదన్ పాల్గొన్నారు.
Post A Comment: