వర్షం ముఖం చాటేయడంతో ఎండిపోతున్న వరి నారు
గుండాల ఆగస్టు1 (మన్యం మనుగడ) వరుణుడురాక వరి నారు కు నీళ్లు లేకపోవడంతో ఎండి పోతుంది. చాలా రోజులుగా వర్షం ముఖం చాటేయడంతో మండలంలో పంటలు ఎండిపోతున్నాయి. గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో పెద్ద మొత్తంలో మొక్కజొన్న పత్తి మరియు పొలాల్లో నారు పోశారు . మరో రెండు మూడు రోజులు వర్షాలు కురవకపోతే మొక్కజొన్న, పత్తి, వరి , ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రెండు మండలాల్లో ఉన్న రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యవసాయం ప్రారంభిస్తే ఆదిలోనే రైతుకు కష్టాలు మొదలయ్యాయి. వరుణుడు కరుణించి వర్షాలు కురిస్తే తప్పా రైతుల ముఖాల్లో ఆనందం కనబడదు
Post A Comment: