మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల కాంగ్రెస్ కార్యాలయంలో మణుగూరు పట్టణ అధ్యక్షులు పిరికి నారి నవీన్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని,దళిత బంధువు లాగా మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కల్పించాలని తెలిపారు. సీఎం కెసిఆర్ 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారు అన్నారు.మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలని రాష్ట్రపతి,ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమే అని గుర్తుచేశారు. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు.సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలను మాయ మాటలతో అబద్ధపు వాగ్దానాలతో మోసం చేస్తున్నారని,కెసిఆర్ కారు ను నమ్ముకొని మోసపోవద్దని,జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు పట్టణ అధ్యక్షులు పిరికి నారి నవీన్,మండల యువజన అధ్యక్షుడు రషీద్,నూరుద్దీన్ మండల ఉపాధ్యక్షులు ముక్కెర. లక్ష్మణ్,ఎస్టి సెల్ అధ్యక్షులు కొమరం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: