మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామ పంచాయతీ, పాపిడి గూడెం గ్రామంలో ఇటీవలె షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు కాలిపోయి నష్టపోయిన కలపాల నాగరాజు కుటుంబాన్ని సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయ్ పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు కూరగాయలు, గ్రుడ్లు, నూనె, బియ్యం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాధు జోత్స్న బాయ్ మాట్లాడుతూ జరిగిన విషియం చాలా బాధాకరం అని, భాదితుకుటుంబానికి ఎవరైనా ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. అదేవిదంగా ప్రభుత్వం నుండి బాధిత కుటుంబానికి జరిగిన నష్టానికి ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Post A Comment: