వైయస్సార్ ఆశయ సాదాకురలు షర్మిలమ్మ మాత్రమే
గుండాల ఆగస్టు 12 (మన్యం మనుగడ) పోడు రైతుల పోరు యాత్రను జయప్రదం చేయాలని మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ సుజాత పిలుపునిచ్చారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పట్టాలను నేటి ప్రభుత్వం స్వాధీనపరచుకొని హరితహారం పేరుతో మొక్కలు నాటడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈనెల 18 వ తారీఖున ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో పోడు భూములు పోయిన రైతుల భూముల్లోనే ఆమె రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే తక్షణమే తొలి సంతకం పోడు భూముల పట్టాలు ఇచ్చే కార్యక్రమంపై సంతకం చేస్తారన్నారు. బాలింతలను సైతం జైలుకు పంపిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ రామ సాయం శ్రీనివాస్ రెడ్డి, శ్యాం ప్రసాద్, సమ్మయ్య , సంధ్యారాణి , భరత్ రెడ్డి, పసుపులేటి సతీష్ , వుకె ప్రసాద్,వుకె కిరణ్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: