యూత్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ యువజన అధ్యక్షులు హర్ష నాయుడు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ తెరాస యూత్ మండల అధ్యక్షులు హర్ష నాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని, మా నాయకులపై లేనిపోని నిందలు వేసి మాట్లాడటం సరికాదన్నారు.మళ్ళీ ఈ లాంటి చర్యలకు పాల్పడితే తగిన గుణపాఠం చెప్తామని అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల నాయకులు మాదాడి రాజేష్,గాజులు నరేష్,యువజన నాయకులు సుబ్రహ్మణ్యం, గువ్వ.విజయ్,సురేష్ తేజ, రఘు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: