వినూత్నమైన నాటు తో రైతులను ఆకట్టుకుంటున్న బెంగాలీ కూలీలు
జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు
మన్యం మనుగడ, పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మండలం లో ని పలు వ్యవసాయ ప్రాంతాలను, ఏడూళ్ల బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు, మణుగూరు డివిజనల్ వ్యవసాయ సహాయ సంచాలకులు బండ బోయిన తాతారావులు పర్యటించారు. మొదట ఉప్పాక గ్రామంలో సాల్వెరు రఘుపతికి చెందిన కరివెద వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అభినందనలు తెలియజేశారు. ఏడూళ్ల బయ్యారం గ్రామంలో వ్యవసాయ రైతులు ముక్కు సుబ్బారెడ్డి, గంగిరెడ్డి సందీప్ రెడ్డి ల వ్యవసాయ విధానాలను అభినందించారు. అనంతరం గొట్టెళ్ళ గ్రామ సమీపంలో కంది సుబ్బారెడ్డి చేస్తున్న వ్యవసాయ ఫల క్షేత్రాన్ని పరిశీలించారు. వినూత్న రీతిలో సుబ్బారెడ్డి చేస్తున్న విధానం పట్ల సంతోషం వ్యక్తపరిచారు. జానంపేట గ్రామంలో బెంగాలీ కూలీల సహాయంతో ఎల్లంకి నరసింహారావు వేసిన బెంగాలీ నాటు విధానాన్ని పరిశీలించి, ఇంత అద్భుతంగా వరి సాగు విధానం ఉందని, ఎటువంటి చీడ పురుగులు సోకకుండా ఇప్పటి వరకు పంట ఆరోగ్యంగా ఉన్న విషయాన్ని గుర్తించారు. భళా బెంగాలీ విధానం అని బెంగాలీ రైతులను జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ప పినపాక మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు కొమరం లక్ష్మణరావు కేశవరావు, వ్యాపారవేత్త సుబ్రహ్మణ్యం, రైతులు అంకి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: