మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యునెస్కో నిబంధనల ప్రకారం పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగా మంగళవారం రామప్పను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర పర్యాటక, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. వారి వెంట ములుగు జడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ మానుకోట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తదితరులు ఉన్నారు.
Post A Comment: