మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు ఎం డి ఓ ఆఫీస్ లో శనివారం నాయి బ్రాహ్మణ మరియు రజక వృత్తిదారులకు ఉచిత విద్యుత్ సరఫరా మరియు ఉచిత కరెంటు మీటర్ కనెక్షన్స్ పై జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి ఈ డి సురేందర్ సెక్షన్ ఆఫీసర్ నందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా లో ఉచిత విద్యుత్ కొరకు చాలా తక్కువ మంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారని, గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల దగ్గర చిన్న చిన్న షాపులు, రేకుల షెడ్లు పెట్టుకొని, వారి వృత్తి పనులు కొనసాగించే నాయి బ్రాహ్మణులు, రజకులు కూడా ఉచిత విద్యుత్ కరెంటు మీటర్ కనెక్షన్ కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సహకార సంఘం జిల్లా నాయకులు కడియాల సత్యనారాయణ, మాడుగుల నాగరాజు, వ లోజి రమేష్, రాజ్ కొండ నాగేశ్వరరావు, ఇవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: