మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీనివాస్ పర్యవేక్షణలో జూలూరుపాడు మండలం గుండేపుడి గ్రామంలో సీజనల్ వ్యాధుల పై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు శనివారం కళాజాత నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, మరియు కరోన పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి పాటల రూపంలో ప్రజలను చైతన్య పరచటం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారావు, సెక్రెటరీ శ్రీను, సారధి కళాకారులు కాంపల్లి బాలకృష్ణ టీం లీడర్ వెంకటేశ్వర్లు, జగన్, పాగి వెంకయ్య, నరేందర్, నీలా, కుమారి, స్నేహా, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: