పారిశుద్ధ్య పనులతో పాఠశాలల్లో హడావుడి
గుండాల ఆగస్టు 27 (మన్యం మనుగడ) ఒకటో తారీకు నుండి బడిగంట మోగనున్న తరుణంలో గుండాల ఆళ్ల పల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. గత రెండు రోజుల నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయులు పిచ్చి మొక్కలను గదుల్లో పెరగకపోయినా దుమ్మును తొలగిస్తున్నారు. పాఠశాల ప్రాంగణం మరియు గదులలో హైడ్రోక్లోరిన్ ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పిల్లలు , ఉపాధ్యాయులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పకడ్బందీగా పనులను చేస్తున్నారు. పాఠశాలల గదుల్లో సామాజిక దూరం ఉండే విధంగా ముందే ఏర్పాట్లను ఆయా పాఠశాలల సిబ్బంది ఏర్పాట్లను చేస్తున్నారు. ఎటువంటి భయాందోళకు గురికాకుండా పిల్లలను పాఠశాలకు పంపవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు
Post A Comment: