మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులో ఇటీవల ఓసి-2 డంపర్ బొలెరో ప్రమాదంలో చనిపోయిన ప్రైవేటు వాహన డ్రైవర్ వేల్పుల.చిన వెంకన్న కుటుంబానికి ఓసి -2 రిలే- సి కార్మికుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజు పేట లోని వెంకన్న నివాసంలో వారి కుటుంబ సభ్యులు భార్య సుజాత కుమారులు గణేష్, మహేష్,తల్లి గంగమ్మ లకు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని నిత్యవసర వస్తువులను నాయకులు బర్ల గోపి,రిలే సి కార్మికులు ఆర్.ఎం.వి. ప్రసాద్,తిరుపతి,గౌస్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా నాసర్ పాషా మాట్లాడుతూ వెంకన్న కార్యక్రమానికి బియ్యం,నిత్యవసర వస్తువులను వితరణగా అందజేసి పెద్ద మనస్సును చాటుకున్న ఓసి-2 రిలే సి కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓసి-2 రిలే-సి కార్మికులు బర్ల.గోపి,ఎం. శ్రీనివాస్,ఆర్.ఎన్.వి.ప్రసాద్, తిరుపతి,రవి,బొగ్గు ముఠా కార్మికులు గంగరాజు,శ్రీను లింగయ్య,మంగయ్య,వెంకన్న కుటుంబసభ్యులు పద్మ మరియు ఏ.మంగీలాల్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: