👉విష జ్వరాలతో బాధపడుతున్న గ్రామస్తులు
👉 భద్రాచలం కొత్తగూడెం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న వైనం
👉 వైద్యానికి రూ వేలు లక్షలు ఖర్చు పెడుతున్న జ్వర పీడితులు
👉 గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక పంచాయతీ మంచం పట్టింది. ఉప గ్రామంలో అనేక మంది డెంగ్యూ మలేరియా జ్వరాల బారిన పడ్డారు. కొన్ని కుటుంబాలలో కుటుంబ సభ్యులందరూ జ్వరంతో మంచపట్టగా,మరి కొన్ని కుటుంబాలలో ఒక్కరు, ఇద్దరు జ్వర పీడితులుగా ఉన్నారు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి భద్రాచలం కొత్తగూడెం పట్టణాలలో ప్రైవేటు వైద్య ఆశ్రయిస్తున్నారు. వైద్యం కొరకు వేలు ,లక్షల అప్పులు చేస్తున్నట్లు వారుతెలిపారు. గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయ్యాలని ఉప్పాక గ్రామస్తులు కోరుతున్నారు.
Post A Comment: