గుండాల ఆగస్టు 11 (మన్యం మనుగడ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి రైతు భాగం వెంకటేశ్వర్లును భాగం వెంకటేశ్వర్లును కొట్టి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని పీ వై ఎల్ సబ్ డివిజన్ నాయకులు అజయ్ అన్నారు. తక్షణమే ఫారెస్ట్ అధికారుల పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దాడిలో పాల్గొన్న ఫారెస్ట్ అధికారులను విధుల నుండి డిస్మిస్ చేయాలని అన్నారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు
Post A Comment: