మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రికొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, పాపిడిగుడెం గ్రామం లో ఆదివాసీ నాయకపోడు సేవ సంగం అద్వర్యం లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసినా సంగం నాయుకులు కోలా లక్ష్మినారాయణ ఆదివాసీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆదివాసీలకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, ఆదివాసీలు ఇప్పటికి ఇంకా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రాజకీయ రంగాలలో వెనుకబడి వుంటున్నారని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన ఆదివాసీ జీవితాలో వెలుగు తీసుకురాలేక పోతున్నారని, ఇప్పటికైనా ఆదివాసీ జీవితాల్లో విద్య, రాజకీయాల్లో మొదలైన రంగాల్లో అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఈ విషియం పై ప్రతి ఒక్క ఆదివాసీ అవగాహన పెంపొందించుకుంటూ అవగాహనా కలిగివుండాలనీ ఆయన తెలిపారు. అనంతరం అందరకి స్వీట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాకపోడు నాయుకులు సంఘం కృష్ణమూర్తి, బద్దె పెద్ద వెంకటేశ్వరరావు, సారిన ముత్తయ్య, తాటికొండ చిన్న లక్ష్మయ్య, గుజ్జుల చిన్న దుర్గారావు, బద్దె సత్యనారాయణ, తాటికొండ రాంబాబు, గడ్డం సత్తిబాబు గ్రామ యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: