👉ఆదివాసి జెండా ఆవిష్కరణ
👉కులదైవం సమ్మక్క- సారలమ్మలకు ఘనంగా పూజలు.
మన్యం టీవీ కొత్తగూడెం ఆగస్టు 9:-
సోమవారంనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండలం, సమ్మక్క సారక్క గద్దెల వద్ద ప్రపంచ ఆదివాసి దినోత్సవం పతాకావిష్కరణ గావించారు లక్ష్మీదేవిపల్లి ప్రధాన రోడ్డు వెంబడి పాత డిపో సెంటర్ సూపర్ బజార్ బస్టాండ్ కలెక్టరేట్ వరకు ఆదివాసీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ని కలిసి ఆదివాసీ సమస్యలపై మాట్లాడి ఆదివాసీ దళిత బంధువు కూడా ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పలు చోట్ల ఉన్న ప్రభుత్వ స్థలాలను వెంటనే సర్వే చేసి నిరుపేదలైన ఆదివాసులకు ఇవ్వాలని ఆయనను కోరారు.
అనంతరం కలెక్టర్ కు వినతి పత్రము ఈ కార్యక్రమంలో ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, కంగాల జగన్, వర్స్ నరసింహారావు, పదం భుజంగరావు, పాయం లక్ష్మీ నర్సు ఎల్ల బోయిన వీరన్న ,బాడిస మోహన్ ,గోగ్గేల రమేష్ ,వాసం అంజిబాబు, కలేటి ప్రవీణ్ కుమార్ తాటి కాంతమ్మ, కుంజ రాంబాయి కాంతమ్మ, ఆదిలక్ష్మి ,శ్రీ రామ్ బలరాం, పాయం రమాదేవి ఇరుప ప్రకాష్, నాగులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత సామాజిక ఉద్యమం కర్ణుడు వాసం రామకృష్ణ దొర ఐకాస కన్వీనర్ వహించారు.
Post A Comment: