మాన్యం టివి దుమ్ముగూడెం:
మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో గత 40 ఏండ్ల నుంచి సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని మాజి యంపీ బాబూరావు డిమాండ్ చేశారు. తరతరాల నుంచి సాగులో ఉన్న 15 మందిరైతులను బెదిరించి భూములను ఖాళీ చేయించి ప్రకృతివనం కట్టే ఆలోచనలను మానుకోవాలని అదికారులకు సూచించారు. సర్వే 32/3లో 15.37 సెంట్లు భూమిని సెంటు భూమిలేని 13 మంది రైతులు ఎకరం భూమి ఉన్న ఇద్దరు రైతులు మెత్తం 15 మంది సాగులో ఉన్నారని వారికి హక్కు పత్రాలు ఇచ్చి రక్షణ కల్పించాలనికోరారు.ఈ కార్యక్రమంలో సి పి యం జిల్లాకమిటి సభ్యులు యలమంచి వంశి,చిలకమ్మ,సీనియర్ నాయకులు చంద్రయ్యగారు రైతులు కారం,నర్శింహరావు,కల్లూరి రాముడు,కల్లూరి లక్ష్మణరావు,కారం కోటమ్మ, కారం శ్రీను,బొర్ర నాగరాజు తదితురలు పాల్గొన్నారు.
Post A Comment: