మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని బెస్తగూడెం లో 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.25 లక్షల రూపాయల తో ఇంటింటికి మంచినీటి సరఫరా పైప్లైన్ నిర్మాణం పనులకు ఇటీవల శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శనివారం ఇంటికీకి మంచినీరు పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అన్నారం, బెస్తగూడెం ప్రజల ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిన విప్ రేగా కాంతారావు కు బెస్తగూడెం గ్రామ ప్రజలు ఘాన స్వాగతం పలికారు.పులా మాలలతో సత్కరించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ గ్రామస్థుల కు ఇచ్చిన మాట ప్రకారం ఇంటిటికి మంచినీరు ఇచ్చామని,ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్, ఇరిగేషన్ ఏ ఈ రమేష్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,మహిళ అధ్యక్షురాలు చంద్రకళ, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,టిఆర్ఎస్ నాయకులు,వట్టం.రాంబాబు,ఎడ్ల శ్రీను,ముద్దంగుల కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళ కార్యకర్తలు శ్యామల,మున్ని,రమాదేవి, సుజాత,కౌర్,యువజన నాయకులు,మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: