CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇటీవల మృతి చెందిన బొగ్గు ముఠా కార్మికులు నాగుల.నరేష్ కుటుంబాని కి బొగ్గు ముఠా కార్మిక సంఘం ఆర్థిక సహాయం

Share it:

 


రూ.2,00,000 రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన విప్ రేగా కాంతారావు


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

మణుగూరు మండలంలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన బొగ్గు ముఠా కార్మికులు నాగుల.నరేష్ కుటుంబాని కి బొగ్గు ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో రూ.2,50,000 రూపాయల ను ఆర్ధిక సహాయం అందజేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా శనివారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా రూ.2,00,000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు బొగ్గు ముఠా కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో ఆందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ,పొశం.నర్సింహారావు,ఎంపీపీ,కారం.విజయకుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,మహిళ అధ్యక్షురాలు చంద్రకళ, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,బొగ్గు ముఠా లోడింగ్,ఆన్ లోడింగ్ కార్మిక సంఘం ప్రెసిడెంట్ పూర్ణ చందర్,సెక్రెటరీ ప్రవీణ్, ట్రెజరర్ వీరయ్య టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, మహిళ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: