CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

119 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసన.

Share it:

 



 మన్యం టీవీ,దమ్మపేట:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

 అశ్వారావుపేట నియోజకవర్గం,దమ్మపేట మండలం,వడ్లగూడెం గ్రామంలో దళిత, గిరిజన దండోర ఆత్మ గౌరవ సభ మద్దిశెట్టి సత్యప్రసాద్ మండల కాంగ్రేస్ ప్రెసిడెంట్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా దళిత గిరిజన దండోర ఆత్మ గౌరవ అశ్వారావుపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ మాసన్నపల్లి లింగోజి,సున్నం నాగమణి జడ్పీటీసీ ములకలపల్లి & టి పి సి సి మెంబర్ హాజరైనారు.ఈ సమావేశంలో లింగోజి సున్నం నాగమణి గారులు మాట్లాడుతూ రాష్ట్రంలో 119 నియోజకవర్గం లో దళిత బంధు పధకం అమలు చెయ్యాలని డిమాండు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గ ఎం.ల్.ఏ రాజీనామ చేస్తే దళిత బంధు పథకం వస్తుంది కనుక ఎం.ల్.ఏ రాజీనామ చెయ్యాలని వినా దం చేస్తు వడ్లగూడెం హరిజన వాడాలో ర్యాలీ చేయ్యటం జరిగింది.ఈ కార్యక్రమంలో రాళ్లపల్లి రాంబాబు,కందుల వెంకటేశ్వరరావు,కొమరం ప్రసాద్,చిలక శ్రీను,ఎం.డి జానీ,సుకుర్,చీకటి శ్రీనివాసరావు, నాగబాబు,సాయి,రాజశేఖర్ తదితరులు పాలుగున్నారు.

Share it:

Post A Comment: