*🔆అర్ధరాత్రి సాబీర్ పాషా ఇంటి వద్ద అరెస్ట్..
*✍️పేదలకు గూడు లేకుండా చేయొద్దు అంటే అక్రమ నిర్బంధాలు??.
*✍️కేసులు పెట్టి జైలుకు పంపిన పేదల ఇళ్లను కూల్చి వేసే ప్రక్రియను అప్పంతావరకు, వారికి నివాసాలు ఏర్పాటు చేసే వరకు సిపిఐ అండగా ఉంటుంది
*✍️అక్రమ నిర్బందాలతో పేదల గొంతునొక్కేలేరు.
*✍️రైల్వే శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సమస్యను జటిలం చేయకుండా సామరస్యంగా పరిష్కరించాలి--సీపీఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా.
మన్యం టీవీ,భద్రాద్రికొత్తగూడెం: సీపీఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా ను అర్ధరాత్రి పదుల సంఖ్యలో తన నివాసాన్ని చుట్టుముట్టి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ పేదలకు గూడు లేకుండా చేయొద్దు అంటే అక్రమ నిర్బంధాలు ఏంటి అని ప్రశ్నించారు. కేసులు పెట్టి జైలుకు పంపిన సరే పేదల ఇళ్లను కూల్చి వేసే ప్రక్రియను అప్పంతావరకు, వారికి నివాసాలు, నష్టపరిహారం ఏర్పాటు చేసే వరకు సిపిఐ అండగా ఉంటుంది తలిపారు. రైల్వే శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోయి సమస్యను జటిలం చేయకుండా సామరస్యంగా పరిష్కరించాలిని కోరారు. అక్రమ నిర్బందాలతో పేదల గొంతునొక్కేలేరుని, సమస్యను జటిలం చేస్తే జరిగే పరిణామాలకు రైల్వే శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
Post A Comment: