లాభసాటి అంటున్న వ్యవసాయ అధికారులు
మినీ ట్రాన్స్ ప్లాంట్ అనుసరిస్తున్న యువ రైతు గంగిరెడ్డి సందీప్ రెడ్డి
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండలంలోని
ఏడూళ్ల బయ్యారం గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మినీ ట్రాన్స్ ప్లాంట్ తో నాటు వేసే పొలాలను సందర్శించారు. ఈ మినీ ట్రాన్స్ ప్లాంట్తో ఒకేసారి నాలుగు వరుసలలో నాటు వేసే విధానాన్ని గమనించి, ఈ విధానాన్ని అనుసరిస్తున్న యువ రైతు గంగిరెడ్డి సందీప్ రెడ్డి ని అభినందించారు. ఈ సందర్భంగా రెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ, ఒక రోజు లో మినీ ట్రాన్స్ ప్లాంట్ పరికరంతో 3 ఎకరాలు నాటు వేయవచ్చు అని, దీనితో నాటు వేయడం వలన సాలుకు సాలుకు, మొక్కకు మొక్కకు మధ్య దూరం ఉండి మొక్కకు గాలి వెలుతురు తగిలి, మొక్క బలంగా పెరుగుతుంది అని, దుబ్బులు బాగా వచ్చి దిగుబడి కూడా ఎక్కువ మొత్తంలో వస్తుందని తెలియజేశాడు. ఈ మిని ట్రాన్స్ ప్లాంటర్ తో ఒక ఎకరానికి నాటు వేయడానికి 4500 రూపాయల ఖర్చు అవుతందని, రైతు ముఖ్యంగా కులీల కోసం ఎదురు చూడకుండా , పెట్టుబడి తగ్గించే ఆన్వేషణలో ఈ మిని ట్రాన్స్ ప్లాంటర్ ని తెప్పించు కొని వరి నాటు వేసుకోవచ్చని తెలియజేశాడు. రైతులు కూలీల బెడద తగ్గించుకొని పెట్టుబడులు పెంచుకునే ప్రయత్నంలో కరేద, బెంగాలి కూలీలతో నాటు, సీడ్ కమ్ పెర్టీలైజర్ డ్రిల్ తొ విత్తనాలు వేయడం, మిని ట్రాన్స్ ప్లాంటర్ ని ఉపయోగించడం ఒంటి విధానాలను గమనించిన వ్యవసాయ అధికారులు రైతులు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యకమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కొమరం లక్ష్మణ్ రావు , కేశవ్ రావు, రైతులు ముక్కు బాల సుబ్బరెడ్డి, గుంటక వెంకటేశ్వర రెడ్డి, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, యక్కంటి అంకిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.
Post A Comment: