మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 26):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ( డిఎంహెచ్ఓ ) డాక్టర్-శీరీష. ఎర్రగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ మరియు (ఆర్ఎటి)రాపిడ్ యాంటిజైన్ టెస్ట్స్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ థియేటర్ లను పరిశీలించి, ఆరోగ్య కేంద్రం లోని అన్ని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిఎంహెచ్ఓ ఈ సందర్భంగా వైద్య బృందానికి,వర్షాకాలం సీజన్లో ప్రజా ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి పలు సూచనలు చేశారు. జిల్లా సహాయ మలేరియా అధికారి-గొంది వెంకటేశ్వర్లు, గ్రామాల్లో నిర్వహించే డ్రైడే - ఫ్రైడే, డి వాటరింగ్ కార్యక్రమాలను పరిశీలించి, తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ నర్స్(పిహెచ్ఎన్)-పుల్లమ్మ, హెచ్వి-శారా రాణి, హెచ్ఈఓ-పోలెబోయిన కృష్ణయ్య, నాగమణి ,ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు ఉన్నారు.
Post A Comment: