మన్యం మనుగడ, కొత్తగూడెం:
భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ పిఆర్సి సూచించిన కనీస వేతనం 19000/- బేసిక్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన30% పిట్మెంట్ అమలు చేయాలని, హమాలి, మోటర్, గ్రామపంచాయతీ తదితర అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనిడిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించి,కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, జిల్లా నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి కే సారంగపాణి,జిల్లా ఉపాధ్యక్షులుతోడేటి నాగేశ్వరరావు,జిల్లా నాయకులు కందగట్ల సురేందర్, వై గోపాల్ రావు, కొప్పుల శ్రీను,జర్పుల సుందర్,యసారపు వెంకన్న, రాయగండ్ల కోటి, పందిల్లపల్లి వీరన్న, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: