మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 27)::అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురం గ్రామంలో జీవవైవిధ్య రచ్చబండ సమావేశం నిర్వహించారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆదేశానుసారం, గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ ఎన్ రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి నుండి వచ్చిన సహజ వనరులను కాపాడుకుంటూ, అనేక రకాల జీవరాశులను రక్షించుకోవడమే జీవవైవిద్య లక్ష్యం అని, అందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి జీవవైవిధ్యానికి కృషి చేయాలని అన్నారు. భారత్ కీ ఆజాది కా ఆమ్రిత్ మహోత్సావ్ కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జీవ వైవిధ్య కమిటీ సభ్యులు భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లీలా కుమార్ రెడ్డి, ఏసుబాబు, కృష్ణకుమారి, రాధ, శ్రీనివాస్ రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: