మొక్కలు పంపిణీ చేసిన ఎస్ఐ-పి తిరుపతిరావు
మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, మండలంలోని అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమంలో మొక్కలను, స్థానిక ఎస్ఐ పి తిరుపతిరావు చేతుల మీదుగా అందజేశారు. పెంట్లం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో పాలకవర్గం సభ్యులు, సర్పంచ్ సవలం రాణి మొక్కలు నాటారు. మర్రిగూడెం గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ షెడ్ ల వద్ద మరియు గుంపెన,తొట్టిపంపు గ్రామాలలో రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ లలో గ్రామపంచాయతీల సర్పంచ్లు, పాలకవర్గ సభ్యులు మొక్కలు నాటించారు.
Post A Comment: