మన్యంటీవీ, అశ్వారావుపేట: గ్రామ పంచాయతీల సెక్రెటరీ ల కంప్లైంట్ తో అశ్వరావుపేట ఎంపీడీవో విజయను సీఈఓ విద్యాలత హైద్రాబాద్ పంచాయతీరాజ్ కమిషనరేట్ కు సరెండర్ చేశారు. పల్లె పకృతి వనాల విషయంలో ఎంపీడీవో నిర్లక్ష్యంగా ఉన్నారని, సెక్రటరీల ను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కలెక్టర్ కి కంప్లైంట్స్ వెళ్లాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో సీఈవో ఎంపీడీఓనీ సరెండర్ చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేసారు. గత ఏడాది డిసెంబర్లో విజయ అశ్వరావుపేట కు ట్రాన్స్ఫర్ అయి వచ్చారు. ప్రస్తుతం ఇన్చార్జి బాధ్యతలను దమ్మపేట సూపరింటెండెంట్ విద్యాధరరావు కి అప్పగించారు.
Post A Comment: