మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని కాకర్ల గ్రామపంచాయతీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నెకంటి వీరభద్రం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బానోత్ రమాదేవి, గ్రామ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్, మరియు వారి అనుచరులు సుమారు 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ సమక్షంలో వీరిని మంగళవారం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కండువాలు కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నెకంటి వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ప్రజల సంక్షేమం కోసం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం తాము పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రజల సమస్యలను, గ్రామపంచాయతీ లోని సమస్యలను, పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని అవి అందరికీ అందుతున్నాయని అన్నారు. కాకర్ల గ్రామపంచాయతీ, తో పాటు జూలూరుపాడు మండలం, వైరా నియోజకవర్గం లో ఉన్న అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, మీ అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మీ అందరిని టిఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని, సమస్య ను నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Post A Comment: