మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య తల్లి మాణిక్యమ్మ కొద్ది రోజుల క్రితం మరణించిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా పాండురంగాపురం గ్రామంలో గల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఐలయ్య గత కొద్ది రోజుల నుండి కరోనా తో బాధపడి ఇటీవలే కోలుకున్న సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: