సిబ్బందికి రైన్ కోట్ ల పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి రైన్ కోట్లను, మణుగూరు డివిజనల్ ఏఎస్పి శబరీష్ పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు ప్రాంతాలలో ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరద ఉధృతిని గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ దోమల రమేష్ , ఎస్సైలు టీ వీ ఆర్. సూరి , జి ప్రవీణ్ కుమార్ , పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: