మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి గుండాల పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వెళుతూ ఇల్లందు రాగానే ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు స్వాగతం పలికారు. మంత్రి చైర్మన్ తో మాట్లాడుతూ. . వస్తున్న దారిలో ఇల్లందు పట్టణంలో జరుగుతున్న హరితహారం కార్యక్రమాలు చూస్తూ వచ్చానని మొక్కలు బాగా పెరిగాయని అభినందించారు. రాత్రి వేళలో ఇల్లందు ప్రధాన రహదారి లో లైట్లు సుందరంగా కనిపిస్తుందని అలాగే ఉదయం కూడా రహదారి ఇరువైపులా ఉన్న చెట్లకు మెరిసేలా రేడియం పెయింటింగ్ చెయ్యమని సలహా ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హరితహారం కార్యక్రమం ఇల్లందు పట్టణం ఆదర్శంగా నిలపాలని చైర్మన్కు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఇల్లందు ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు నవీన్ కుమార్, వాంకుడోత్ తార, మహిళా విభాగం అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, నాయకులు లాలు, నెమలి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: